రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణ పరిధిలోని నందలపాడు, జూటూరు కాలనీలలో ఆదివారం ఆయన పర్యటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలసి గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఓటు వేసి రాష్ట్రంలో అభివృద్ధికి పాటు పడాలన్నారు.