ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న నాలుగు రోజుల్లో వడగాలుల తీవ్రత మరింతగా పెరుగుతుందని ప్రకటించింది. ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాలు వీస్తాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇంటి నుంచి బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.