పోలీసు సెక్యూరిటీ మధ్య ఉరవకొండకు చేరుకున్న ఈవీఎంలు

2263చూసినవారు
ఉరవకొండలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక వాహనంలో పోలీసు సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు ఉరవకొండకు చేరుకున్నాయి. ఆర్ఓ కేతన్ గార్గ్ పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ, ప్రత్యేక పోలీసు రక్షణ స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూములో ఈవీఎంలను భద్రపరిచి గదులను సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్