అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

53చూసినవారు
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకొన్నట్లు ఉరవకొండ గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం బెళుగుప్ప పోలీస్ స్టేషన్ లో సీఐ మాట్లాడుతూ.. గుండ్లపల్లి మలుపు వద్ద రాణిబిన్నూరుకు చెందిన పరశురామ్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద నుంచి రూ.24 వేల నగదు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్