అనంతపురం
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ సోమవారం
వైసీపీ మ్యానిఫెస్టోపై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒక ఛాన్స్ అంటూ గతంలో చాలా హామీలు ఇచ్చిన
వైసీపీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు మరోసారి అబద్ధపు హామీలతో జనం ముందుకు వస్తున్నారన్నారు. గతంలో ఎమ్మెల్యే అనంత ఇదే తరహాలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అని అన్నారు.
జగన్ కూడా అదే తరహా హామీలతో మ్యానిఫెస్టో తయారు చేశారన్నారు.