అక్టోబర్ 7 వరకు నవోదయ పరీక్ష దరఖాస్తు గడువు: డిఈఓ

77చూసినవారు
అక్టోబర్ 7 వరకు నవోదయ పరీక్ష దరఖాస్తు గడువు: డిఈఓ
జవహర్ నవోదయ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మీ శుక్రవారం తెలిపారు. దీనికి సంబంధించి దరఖాస్తు గడువును అక్టోబరు 7వ తేదీ వరకు పొడిగించామన్నారు. మరిన్ని వివరాలకు www. navodaya. gov. in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్