ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన వీసీ

71చూసినవారు
ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన వీసీ
అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మోస్చిప్ టెక్నాలజీస్ కంపెనీలో సంవత్సరానికి రూ. 6,00,000 వేతనంతో కూడిన ఉద్యోగాలకు శుక్రవారం ఎంపికయ్యారు. ఇంఛార్జ్ వీసీ సుదర్శన రావు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఇంఛార్జ్ వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్