బీజేపీ, టీడీపీ, జనసేన కలసి సమన్వయంతో ముందుకు వెళ్లాలి

2179చూసినవారు
బీజేపీ, టీడీపీ, జనసేన కలసి సమన్వయంతో ముందుకు వెళ్లాలి
పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిటాల శ్రీరామ్ ఫోకస్ చేశారు. సోమవారం బీజేపీ నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈనెల 4న కూటమి అభ్యర్థి సత్యకుమార్ ధర్మవరం రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమాలోచనలు చేశారు. ముఖ్యంగా ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించారు. జనసేన నాయకులను కలసి వారితో సమావేశం నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్