ధర్మవరం: ఉదృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి

60చూసినవారు
ధర్మవరం: ఉదృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి
ధర్మవరం మండల పరిధిలో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కనంపల్లె గ్రామానికి గురువారం రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. మరోవైపు నది వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. నది వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్