వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కళాజ్యోతి సర్కిల్లో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహాపురుడు మహర్షి వాల్మీకి అని కొనియాడారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.