బిల్వంపల్లిలో మంచినీటికి కటకట

2233చూసినవారు
బిలవంపల్లి గ్రామంలో మంచినీటికి తీవ్ర కరువు ఏర్పడింది. గత 15 రోజులుగా గ్రామంలో మంచినీటి సరఫరా సరిగ్గా లేదని గ్రామస్తులు మహిళలు వాపోయారు. గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బోర్లు ఎండిపోవడంతో అడపాదడపా వచ్చే అరకొర నీటిని పట్టుకోవడానికి గంటలకొద్ది నీళ్ల ట్యాంకు వద్ద కుళాయిల వద్ద పడి గాపులు కాస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందించి మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్