విశ్వకర్మ మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి

80చూసినవారు
విశ్వకర్మ మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి
తిరుపతిలో ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం మొదటి వార్షికోత్సవంలో భాగంగా కళాఖండాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం స్టాల్స్ ను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ. భగవంతుడు ప్రాణం పోసి జీవుల్ని సృష్టిస్తే అద్భుతమైన నైపుణ్యంతో జీవకళ ఉట్టిపడే కళాఖండాలను చేతివృత్తి కళాకారులు సృష్టించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్