నీటి సంపులో పడి బాలుడు మృతి

3296చూసినవారు
నీటి సంపులో పడి బాలుడు మృతి
గుంతకల్లు పట్టణంలోని బెస్ట కాలనీకి చెందిన మహబూబ్ దౌలా, రమీజా దంపతుల కుమారుడు జిశాంత్ (4) గురువారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. అక్కతో కలసి ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్ళి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డారు. వెంటనే గుర్తించిన తండ్రి మహబూబ్ దౌలా సంపులో పడిన కొడుకును బయటికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్