కూటమితోనే ప్రజా పాలన సాధ్యం: బిజెపి

75చూసినవారు
కూటమితోనే ప్రజా పాలన సాధ్యం: బిజెపి
కూటమి ప్రభుత్వంతో ప్రజాపాలన సాగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ రెడ్డి అన్నారు. దేశంలో ఎన్డీఏ, రాష్ట్రం కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ఐదేళ్ల అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారన్నారు. వారి అరాచకాలు, ప్రజావ్యతిరేక పాలన చూడలేక ప్రజలు కసిగా ఓడించారన్నారు. జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్