పోలీస్ స్టేషన్ లోనే బాహాబాహీకి దిగిన ఇరువర్గాలు

57చూసినవారు
కళ్యాణదుర్గం పోలీసు స్టేషన్ లో దొడగడ్డ, ఎర్రంపల్లి గ్రామాలకు చెందిన ఇరువర్గాలు శనివారం బాహాబాహీకి దిగాయి. భార్యాభర్తల గొడవ విషయమై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ఇరువర్గాలు వచ్చాయి. ఆ సమయంలో మాటామాటా పెరిగి స్టేషన్ లోనే బాహాబాహీకి దిగారు. ఏఎస్ఐ గొడవ జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్