కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులతో ఆటలాడుతుంది: బండి సంజయ్

84చూసినవారు
తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులతో ఆటలాడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. పేదలను వేధించడం ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. అది హైడ్రా అయినా, మూసీ అయినా.. పేదలకు మద్దతుగా బీజేపీ నిలుస్తుందని అన్నారు. బుల్డోజర్‌తో ఇళ్లు కూలగొట్టే ముందు.. బీజేపీ నేతలపై నుంచి వెళ్లాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాలపై పునరాలోచించి తక్షణం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్