ఒంటిమిద్దిలో చిరుతల హల్ చల్

69చూసినవారు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామ సమీపంలోని పొలాల్లో, కొండల్లో చిరుతలు కనిపించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్తున్న సమయంలో చిరుతలు కొండపై భాగంలో అటు ఇటు వెళ్తుండడంతో రైతులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మంగళవారం ఉదయం ఓ చిరుతను రైతులు చూశారు. దాదాపు 4, 5 చిరుతలు సంచరిస్తున్నాయని వాటిని కట్టడి చేసే విధంగా అటవీ శాఖ అధికారుల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్