పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి - ఆరోగ్యం కాపాడుకోండి

63చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 14వ రోజు సోమవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వార్డ్, శానిటరీ, పర్యావరణ ఇన్ స్పెక్టర్ రాధిక, లక్ష్మీనారాయణ, సతీష్ విద్యార్థులకు అవగాహనను కల్పించారు. అలాగే ఎన్ఎస్ఎస్ పీవో శ్రీధర్ ఆధ్వర్యంలో డ్రైనేజీలో చెత్త వేయకు, దోమలకు ఇల్లు కట్టకు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్