కళ్యాణదుర్గం: కార్మికుల బకాయిలు చెల్లించే వరకు సమ్మె ఆగదు

56చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీరామిరెడ్డి వాటర్ పంప్ హౌస్ వద్ద కార్మికులు ఆదివారం కూడా సమ్మె కొనసాగించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, పలువురు సీఐటీయూ నాయకులు కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఓబులు మాట్లాడుతూ ప్రభుత్వం జీతాల బకాయిలతో పాటు పీఎఫ్ చెల్లించే వరకు కార్మికులు సమ్మె కొనసాగిస్తారన్నారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్