కళ్యాణదుర్గం: బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో వాసవి మాత

53చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఆదివారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాతను బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న వాసవి మాతను దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్