ఎంపీ కి వినతి పత్రం సమర్పించిన ముస్లిం ఐక్యవేదిక నాయకులు

66చూసినవారు
ఎంపీ కి వినతి పత్రం సమర్పించిన ముస్లిం ఐక్యవేదిక నాయకులు
అనంతపురం పట్టణంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బి. కె. పార్థసారథిని అయన నివాసంలో హిందూపురం ముస్లిం ఐక్యవేదిక నాయకులు ఆదివారం కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం సవరణకు తెలుగుదేశం ప్రభుత్వం, హిందూపురం పార్లమెంటు సభ్యులు అండగా నిలవాలని వారు కోరారు. కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు ఉమర్ ఫారుక్ ఖాన్, అజంతుల్లా, ఉమర్ ఖాన్, అమానుల్లా, అజిముల్లా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్