డీఎస్పీ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

64చూసినవారు
డీఎస్పీ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
శ్రీ సత్య సాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం డిఎస్పి స్థాయి అధికారులతో ఎస్సీ, ఎస్టీ మిస్సింగ్ కేసులపై ఎస్పీ రత్న సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్ పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులను సమీక్షించి, ఆయా కేసుల్లో జరిగిన దర్యాప్తు తీరును ఆమె పరిశీలించారు. అట్రాసిటీ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యేవిధంగా డీఎస్పీలు పర్యవేక్షించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్