డి హీరేహల్ మండలం సోమలాపురం, నాగలాపురం గ్రామాలలో మంగళవారం ఎస్సై ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసు ఖవాతు నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఓటర్లు భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ఓటర్లలో ధైర్యం నింపటం కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. నిర్భయంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.