భక్తులతో పోటెత్తిన శ్రీరాముడి ఆలయాలు

7383చూసినవారు
రాయదుర్గం పట్టణములో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రాముడి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. కోటలో నగరేశ్వర స్వామి, బళ్లారి రోడ్డు కోదండరాముడి ఆలయాల్లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామి వారికి పంచామృత, కుంకుమ అర్చనలు చేపట్టి ప్రత్యేకముగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శ్రీరామ నామ స్మరనతో ఆలయ ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి. నేడు దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని పురోహితులు శ్రీధర్ భట్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్