శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం చిలమకూరు గ్రామంలో వున్న బాల ఆంజనేయ స్వామి దేవాలయము తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా అంబికా మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నానని అన్నారు. అదేవిధంగా శింగనమల నియోజకవర్గ ప్రజల ఆప్యాయత ఎంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు.