సింగనమల మండలంలో జెసిబి, ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని శుక్రవారం మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాచేపల్లి లెదర్ ఫ్యాక్టరీ ఎదురుగా వున్న పెన్నా నదిలో జెసిబితో ట్రాక్టర్లకు నింపుకొని జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. తరిమెల బ్రిడ్జి పెన్నా నది దగ్గర జెసిపి తో ఇటు తరిమెల అటు చిట్టూరు నుండి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు.