యల్లనూరులో పొలంబడి కార్యక్రమం

75చూసినవారు
యల్లనూరులో పొలంబడి కార్యక్రమం
యల్లనూరు మండలంలో వ్యవసాయాధికారులు పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు పంటల సాగుపై సూచనలు, సలహాలు చేశారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి భాస్కర్ నాయుడు అనే రైతు పొలాన్ని సందర్శించారు. చీనీ పంటలో బంక తెగుళ్ళపై బోర్డు పేస్ట్ కాండానికి పోయాలని ఎఓ రామకృష్ణ సూచించారు.

సంబంధిత పోస్ట్