సచివాలయ సేవలను ప్రజలకు సకాలంలో అందించాలి

81చూసినవారు
సచివాలయ సేవలను ప్రజలకు సకాలంలో అందించాలి
సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. శుక్రవారం సింగనమల మండలం తరిమెల గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది అందరూ సచివాలయ పరిసర ప్రాంతాలను, కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది అందరూ నిర్ణీత సమయంలో కార్యాలయమునకు హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్