శింగనమల నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా శనివారం ఎం. వీరాంజనేయులు తన నామినేషన్ దాఖలు చేశారు. శింగనమల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం శింగనమల నియోజకవర్గం నుండి నామినేషన్ వేశారు. ఈకార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, వైసీపీ మండల కన్వీనర్ చిక్కాల బాలకృష్ణ తరలి వచ్చారు.