తాడిపత్రి ఘటనలో మరో 11మంది రిమాండ్

60చూసినవారు
తాడిపత్రి ఘటనలో మరో 11మంది రిమాండ్
తాడిపత్రిలో సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు 11 మందికి గుంతకల్లు జ్యుడీషియల్ మొదటి తరగతి న్యాయస్థానం న్యాయమూర్తి మంజుల 14 రోజులు రిమాండ్ విధించారు. అందరిని కడప జైలుకు తరలించాలని ఆదేశించారని పోలీసులు తెలిపారు. వారిని ప్రత్యేక వాహనంలో సాయుధ బలగాలతో తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్