యాడికి మండల కేంద్రంలోని జె. సి దివాకర్ రెడ్డి కళాశాల సమీపంలో మంగళవారం మండల నాయిబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపి నిధుల కింద దాదాపు 10 లక్షల రూపాయలతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేయడం జరిగిందన్నారు.