యాడికి లో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

1547చూసినవారు
యాడికి మండల కేంద్రంలోని కోన రోడ్డులో గురువారం సిఐ నాగార్జునరెడ్డి తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలతో పారిపోతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ వివరాలు వెల్లడించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో గిరిజన కుమార్, సూర్యచంద్ర, ప్రేమ్
సాయి లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు జతల బంగారు కమ్మలు, ఒక కారు, సెల్ఫోన్, నాలుగు వెండి కుంకుమ భరిణ, వెండి మొలతాడు, గజ్జలు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్