రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

50చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కడపకు చెందిన సుబ్బరాయుడు, అరవింద్ పనినిమిత్తం తాడిపత్రికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. వంగనూరు గ్రామస మీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో వారిద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్బరాయుడును మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్