డయేరియా కేసులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి

64చూసినవారు
డయేరియా కేసులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి
ఐదేళ్లలోపు పిల్లలకు డయేరియా కేసులు రాకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని వైద్యాధికారి డాక్టర్ పావని వైద్య ఆరోగ్య సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఉరవకొండ మండలంలోని రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉధృతి అతిసార నియంత్రణపై సిహెచ్ఎ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు వైద్యాధికారి ఆధ్వర్యంలో శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిసార ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్