చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు

78చూసినవారు
చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం తన వంద రోజుల పాలనలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఉరవకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారన్నారు. పేదలకు ఇంగ్లీషు మీడియం విద్య, వైద్య అందకుండా చేస్తున్నారన్నారు. వైసిపి పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్