తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుదారులకు.. శుభవార్త

79చూసినవారు
తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుదారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుభవార్త చెప్పారు. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి 19వ గేట్ కొట్టుకుపోయిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి కొద్దిసేపటి కిందట మొదటి గేటును విజయవంతంగా దించగలిగాం అని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్నది అనుకున్నట్టుగా చాలా విజయవంతంగా గేటు దింపే కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్