టీఎంఆర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి: పశు వైద్యాధికారి

80చూసినవారు
టీఎంఆర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి: పశు వైద్యాధికారి
ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో అందించే సంపూర్ణ మిశ్రమ దాణా(టీఎంఆర్) కావాల్సిన రైతులు, పాడి పెంపకందారులు కూడేరు మండలంలోని రైతుసేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి శ్రీనివాసులు శనివారం విలేఖరులతో తెలిపారు. ఒక కేజీ సంపూర్ణ మిశ్రమ దాణా కోసం రూ. 6. 50లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. గరిష్టంగా 1, 800 కేజీలు వరకు ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్