రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

59చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
కూడేరు పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు. అనంతపురానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఉరవకొండకు బయల్దేరాడు. అదే సమయంలో మరుట్ల-1వ కాలనీకి చెందిన జగదీష్ అనే యువకుడు కూడేరుకు వస్తుండగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. గాయపడ్డ వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్