ఉరవకొండ: వీరశైవ లింగాయలను ఓబీసీలుగా గుర్తించాలి

50చూసినవారు
ఉరవకొండ: వీరశైవ లింగాయలను ఓబీసీలుగా గుర్తించాలి
ఏపీలోని వీరశైవ లింగాయతులను ఓబీసీలుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటునందించి, ఓబీసీలలో చేర్చాలని వీరశైవ లింగా యత సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉరవకొండ కేంద్రంలోని వీఎస్వీ ఫంక్షన్ హాల్ నందు శనివారం వీరశైవ లింగాయత ఎంప్లాయిస్ అసోసియేషన్ అనంతపురం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిలభారత సమాజ మహా వేదికకు నూతనంగా ఎన్నుకోబడిన కేంద్ర, రాష్ట్ర అసోసియేషన్ సభ్యులకు సన్మానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్