మదనపల్లెలో క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం

68చూసినవారు
క్యాన్సర్ బాధితుల సహాయార్థం మదనపల్లెకు చెందిన నాగవేణి తన కేశాలను దానం చేసింది. మదనపల్లె హెల్పింగ్ మైండ్స్ ఆఫీస్ లో ఆదివారం తన వెంట్రుకలను అందజేసింది. హెల్పింగ్ మైండ్స్ సంస్థ సభ్యులు నాగవేణి దాతృత్వాన్ని అభినందిస్తూ ప్రశంసాపత్రం, పూలమొక్కను అందించారు. ఇప్పటివరకూ 49 మంది క్యాన్సర్ బాధితుల కోసం తమ కేశాలను దానం చేసినట్టు ఆ సంస్థ వ్యవస్థాపకులు అబు బాకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్