ఆటో నుంచి పడి వ్యక్తికి గాయాలు

54చూసినవారు
ఆటో నుంచి పడి వ్యక్తికి గాయాలు
ఆటో నుంచి కింద పడి ఓ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డట్లు మదనపల్లె సీఐ శేఖర్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని దేవళం వీధిలో ఉంటున్న గంగిరెడ్డి శుక్రవారం సొంత పనిమీద కొత్తపల్లెకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి ఆటోలో మదనపల్లెకు వస్తుండగా, ఈశ్వరమ్మ కాలనీ మలుపు వద్ద గంగిరెడ్డి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్