వేడి నీళ్లు పడి కార్మికునికి తీవ్ర గాయాలు

65చూసినవారు
వేడి నీళ్లు పడి కార్మికునికి తీవ్ర గాయాలు
ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడిపై వేడి నీళ్లు పడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె సీఐ శేఖర్ కథనం మేరకు. మదనపల్లె పట్టణం సిటిఎం రోడ్ లోని ఓ పైపుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ పాండే మీద ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన సహచరులు బాధితుడిని చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్