రామసముద్రంలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

67చూసినవారు
రామసముద్రంలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
రామసముద్రం మండలం దిగువబొంపల్లికి చెందిన సుబ్రహ్మణ్యంకు చెందిన రెండు పాడి ఆవులు పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. టైర్ల ఫ్యాక్టరీ సమీపంలో రేకుల షెడ్డులో అవులను రాత్రి కట్టేశారు. అయితే ఆదివారం వేకువజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పిడుగుపాటు సంభవించడంతో రెండు ఆవులు మృతి చెందాయి. ఒకొక్క ఆవు రూ. 70వేలు విలువ చేస్తుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

సంబంధిత పోస్ట్