ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి: ఎస్పి

61చూసినవారు
ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి: ఎస్పి
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని కడప జిల్లా పోలీసు అధికారి వి. హర్షవర్ధన్ రాజు సిబ్బందికి సూచించారు. సోమవారం జిల్లా ఎస్పీ బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఫిర్యాదుల నమోదు కొరకు స్టేషన్ కు వచ్చేవారిపట్ల గౌరవప్రదంగా నడుచుకొని వారి ఫిర్యాదులు స్వీకరించాలని ఎస్పీ తెలిపారు. అనంతరం స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్