రేబిస్ పై అవగాహనతో మరణాలు నివారించవచ్చు -డా.మదన మోహన్ రెడ్డి

77చూసినవారు
రేబిస్ పై అవగాహనతో మరణాలు నివారించవచ్చు -డా.మదన మోహన్ రెడ్డి
రేబిస్ వ్యాధి మరణాలు లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అర్చన విద్యాసంస్థల అధినేత డా. పి. మదన మోహన్ రెడ్డి అన్నారు. రాయచోటిలో అర్చన విద్యాసంస్థలలో ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడిన ఆయన, రేబిస్ వ్యాధి టీకాల ద్వారా పూర్తిగా నివారించవచ్చని చెప్పారు. జంతువు కరిచిన వెంటనే సబ్బు నీటితో గాయాన్ని శుభ్రం చేసి, నిర్ణీత రోజుల్లో టీకాలు వేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్