మైదుకూరు నూతన ఆర్టీసీ బస్సుకు పూజలు

62చూసినవారు
మైదుకూరు నూతన ఆర్టీసీ బస్సుకు పూజలు
మైదుకూరు డిపోకు చెందిన కొత్త బస్సును శుక్రవారం బ్రహ్మంగారిమఠంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి ఆలయ సన్నిధిలో వేద పండితులు శ్రీనివాసుల చారి, శేషాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బస్సు మైదుకూరు- హైదరాబాద్ కు సర్వీస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు ఆర్టీసీ జనరల్ ఏడిసి. యం. లక్ష్మయ్య, అసిస్టెంట్ మెకానికల్ కె. యం. బాష, డ్రైవర్. కె యస్ వాసు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్