బైకులు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

71చూసినవారు
బైకులు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు
దువ్వూరు మండలం క్రీస్తురాజాపురం వద్ద ఆదివారం రాత్రి రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన సురేంద్ర దువ్వూరు మీదుగా మైదుకూరుకు వెళ్తుండగా దువ్వూరు మీదుగా ప్రొద్దుటూరుకు వెళ్తున్న చెన్నూరు మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన సాయి బైకు ఢీకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వినోద్ కుమార్ తన జీపులో క్షతగాత్రులను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్