వైఎస్సార్ జిల్లా పులివెందులలో మాజీ సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న జగన్ను కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో పోలీసులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దాంతో ఇవాళ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలను మాత్రమే జగన్ను కలిసేందుకు అనుమతిస్తున్నారు.