కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు బ్యాటరీ వాహనాలను వాడాలి

80చూసినవారు
కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు బ్యాటరీ వాహనాలను వాడాలి
రాయచోటి లో బుధవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విద్యుత్ బైక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో వాహనదారుల సంఖ్య ఎక్కువ కావడంతో కాలుష్యం పెరిగిపోతోందన్నారు. కాలుష్యం పెరిగిపోవడంతో వర్షాలు రాకపోవడం, ప్రజలు వ్యాధులకు గురి కావడం వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు. దీంతో కాలుష్యాన్ని నివారించేందుకు బ్యాటరీ వాహనాలపై ప్రభుత్వం మక్కువ చూపుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్