ఖగోళ విషయాల పట్ల విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించేందుకు ఐసిఐసిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంబేపల్లి జడ్. పి ఉన్నత పాఠశాలలలో శనివారం ఖగోళ ప్రయోగశాలలను ప్రారంభించామని జిల్లా డెవలప్మెంట్ ఆఫీసర్ రాజేశ్వరి తెలిపారు. "ఖగోళ ప్రయోగశాల నిర్వహణ విధానం" పై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖగోళ వింతలను తెలుసుకోవడానికి, ఈ ప్రయోగశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.